దివంగత మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్యనటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కే బయోపిక్ల మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్లోను, తెలుగు రాజకీయాల్లోను పెద్ద సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బయోపిక్లు సంచలనం రేపుతున్నాయి. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చేసింది.
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరిలో ముహూర్తాన్ని జరపుకోనుంది. ఈ సినిమాకోసం ప్రస్తుతం టీజర్ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్రస్తుతం స్క్రిఫ్ట్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాను జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లాంఛ్ చేయనున్నారు. నటరత్న ఎన్టీఆర్ రోల్లో ఆయన తనయుడు యువరత్న బాలకృష్ణ కనిపించే ఈ సినిమా ముహూర్తం రోజునే ఓ టీజర్ను కూడా రిలీజ్ చేయనున్నారట. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం రోజునే టీజర్ అంటే నందమూరి, టీడీపీ అభిమానులకు పండగే.
ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నీషీయన్లు పని చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత దర్శకుడిగా, సాయి మాధవ్ బుర్రా మాటల రచయితగా, రవివర్మన్ సినిమాటోగ్రాఫర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మిగతా టెక్నీషీయన్లు, నటీనటుల ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోందట. మొత్తంమీద ఎన్టీఆర్ బయోపిక్ ముహూర్తం రోజే చూపించబోయే టీజర్.. ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.