టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది. ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.
బాహుబలి 2 సినిమా భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్, అనుష్క, రానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇక బాహుబలి 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న రాజమౌళి నెక్ట్స్ సినిమాపై జోరుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ల తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ వెనక సర్వం సిద్ధమైపోతోంది. ఈ చిత్రం గురించి త్వరలోనే గ్రాండ్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ ఉపయోగించకుండా .. పూర్తి స్థాయి మాస్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇక రాజమౌళికి ఓ డ్రీమ్..నందమూరి, చిరంజీవి కుటుంబాల హీరోలతో సినిమా తీయాలని..ఆ కోరిక త్వరలో తీర్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. సగటు కమర్షియల్ చిత్రాలకి అయ్యే బడ్జెట్కి రెండింతలు పెట్టబోతున్నారని, ఈ సినిమా మాస్ చిత్రాల్లోనే తలమానికంగా వుంటుందని చెప్పుకుంటున్నారు. గతంలో రాజమౌళి మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే..మరి ఈ చిత్రం బాహుబలి 2 రికార్డులని తెలుగు రాష్ట్రాల వరకు తుడిచిపెట్టేయగలదని అంచనాలు పెరిగిపోతున్నాయి.