టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ సినిమాతో వరుసగా నాలుగో హిట్ అందుకున్నాడు. జై లవకుశ సినిమా ఇప్పటికీ నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వస్తోంది.
పవన్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాను సెట్స్మీదకు తీసుకెళ్లనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ తన ఫ్యామిలీతో ఖుషీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో నటించే మెయిన్ కాస్టింగ్ను, టెక్నికల్ డిపార్ట్మెంట్ మెంబర్స్ను ఒక్కొక్కరిని ఎంపిక చేసే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.
లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వీరిలో ఒకరు బ్రిటీష్ హాట్ భామ అమీ జాక్సన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒక హీరోయిన్గా కంటే ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాల్లో ఆమెకు ఒంపు సొంపుల భామగా మంచి పేరుంది. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్కు అమీని ఎంపిక చేశారా ? లేదా ? సెకండ్ హీరోయిన్ రోల్కు ఎంపిక చేశారా ? అన్నది తెలియరాలేదు. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్ పేరు ఎంపిక చేశారని టాక్.