మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవికి రెండు బ్లాక్బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత వివి.వినాయక్ సొంతం. చిరు తనయుడు రాంచరణ్కు నాయక్ లాంటి హిట్ ఇచ్చిన వినాయక్ మరో మెగా కాంపౌండ్ హీరో బన్నీతో కూడా బద్రీనాథ్ లాంటి సినిమా తీశాడు. తాజాగా ఈ సంక్రాంతికి చిరు కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ ఫామ్లోకి వచ్చిన వినాయక్ మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అగ్రనిర్మాత సీ కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్మీద ఉండగానే ప్రి రిలీజ్ బిజినెస్ ఎంక్వైరీలు టాప్ రేంజ్లో వస్తున్నట్టు ట్రేడ్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. సాయి గతంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో వరుస హిట్లు కొట్టడంతో మనోడి మార్కెట్ రూ.30 కోట్లను దాటేసింది.
ఆ తర్వాత రెండు వరుస ప్లాపులు వచ్చినా తన మేనరిజమ్స్, డైలాగ్స్, ఫైట్స్తో మెగా ఫ్యామిలీతో పాటు ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. విన్నర్ సినిమా ప్లాప్ అయినా ఆ సినిమాకు ఫస్ట్ డేతో పాటు ఫస్ట్ వీకెండ్ రికార్డు స్థాయిలో సాయి కెరీర్లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఫామ్లో ఉన్న వినాయక్ డైరెక్షన్లో తేజు సినిమా చేస్తుండడంతో ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి సాయి కెరీర్లోనే టాప్ రేటకు ప్రి రిలీజ్ బిజినెస్ ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యాయి.
సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే టైంకు ఈ సినిమాకు సాయి కెరీర్లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్లు జరిగే ఛాన్సులు ఉన్నాయి. సాయికి మాస్లో ఉన్న ఫాలోయింగ్తో పాటు కమర్షియల్ డైరెక్టర్ వినాయక్ డైరెక్ట్ చేస్తుండడం, సాయి సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుండడంతో ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ డిమాండ్ వచ్చేసింది. ఈ సినిమాకు ప్రముఖ స్టోరీ రైటర్ ఆకుల శివ కథ, మాటలు అందించారు.