చెన్నై చిన్నది సమంత మాయ చేసింది. నాగచైతన్యను మనువాడింది. పెద్దింటికి కోడలుగా వచ్చింది. ఇక ఇప్పుడు టాలీవుడ్లో అందరి దృష్టి మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ – రెజీనాల లవ్స్టోరీ మీదే ఉంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ వార్తలపై వీరు సూటిగా ఎప్పుడూ స్పందించడం లేదు. ఇలా స్పందించకపోవడం వెనక వస్తోన్న టాక్ ఏంటంటే సాయిధరమ్ తేజ్ రెజీనాతో లవ్ మ్యాటర్ను ఇంట్లో చెప్పేశాడట. వీరిద్దరి లవ్ మ్యాటర్ కథ క్లైమాక్స్కు వచ్చేసినట్టే తెలుస్తోంది.
సాయి ఇంట్లో ఈ విషయంపై తీవ్రతర్జనభర్జనలు జరిగినట్టు తెలుస్తోంది. వారివైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదట. నీ లైఫ్ నీ ఇష్టం… ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పారట. ఫలితంగా ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక సాయి తొలి సినిమా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ రెండు సినిమాల్లోను వీరిద్దరు జంటగా నటించారు. తాజాగా వచ్చిన నక్షత్రంలో కూడా మెరిశారు. ఈ సినిమాల షూటింగ్ల టైంలో ఏర్పడిన స్నేహంతో వీరిద్దరు ఘాటుగా ప్రేమలో మునిగి తేలుతున్నారన్న టాక్ రెండేళ్లుగానే ఉంది.
ఇక ఇండస్ట్రీలో వినపడుతోన్న టాక్ ఏంటంటే సాయి మాత్రం రెజీనాను పెళ్లి చేసుకుంటానని ఆమెకు గట్టిగానే మాట ఇచ్చాడట. మరి ఇంట్లో వాళ్ల నుంచి అయితే మరీ పాజిటివ్ రియాక్షన్ అయితే ఉన్నట్టు కనపడడం లేదు. మరి సాయి రెజీనాకు నిజంగానే మాట ఇస్తే… దానిని నిజం చేసేందుకు ఎంతవరకు ధైర్యం చేస్తాడన్నదే ? చూడాలి.