టాలీవుడ్ యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ”జై లవకుశ” విడుదలకు సిద్ధం అయింది. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటోన్న ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే జై లవకుశ ఆడియో డైరెక్టుగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలకు మరీ కాకపోయినా ఓకే అన్న టాక్ వచ్చింది.
రేపు హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తుండగా .. అందులో ఒకటి నెగిటివ్ షేడ్లో ఉంటుందని ట్రైలర్లో ఇప్పటికే చూపించారు. ఇక ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్లో ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ట్విస్టులన్నింటిలోను రెండు ట్విస్టులు అయితే ప్రేక్షకులను మైండ్ బ్లోయింగ్ చేస్తాయట.
జై పాత్రలో విలన్ గా కనిపించే ఎన్టీఆర్ చివరకు హీరోగా మారతాడని … అలాగే మొదటి నుండి హీరోగా ఉన్న మరో పాత్ర .. విలన్గా మారుతుందని తెలుస్తోంది. ఈ రెండు ట్విస్టులు వింటుంటేనే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. ఇక వీటిని తెరమీద చూస్తే ఇంకెలా ఉంటుందో అన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి.
ఈ సినిమా కోసం కోన వెంకట్ అదిరిపోయే ట్విస్టులతో కూడిన స్క్రిఫ్ట్ ఇచ్చాడట. ఇప్పటికే టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్కు జై లవకుశ కూడా కెరీర్లోనే అదిరిపోయే హిట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇక ఈ సినిమాకు వరల్డ్వైడ్గా రూ.90 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.