ఆ డైరెక్టర్కు టాలీవుడ్లో సపరేట్ ఇమేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలతో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్లు ఇచ్చినా ఒక్క హిట్పడితే చాలు మనోడు ట్రాక్లోకి వచ్చేస్తాడన్న అభిప్రాయం నిన్నటి ఉదయం వరకు అందరిలోను ఉంది. మిస్టర్ ప్రీమియర్ షో ముందు వరకు శ్రీను వైట్ల మీద అందరికి ఈ అభిమానమే ఉంది. శ్రీను వైట్ల ఈ సారి సత్తా చాటుతాడు..తన స్టామినా చూపించి ట్రాక్లోకి వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు.
ఎప్పుడైతే మిస్టర్ ప్రీమియర్ షో పూర్తయ్యిందో ప్రేక్షకులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. శ్రీనుకు ఇక టాలీవుడ్లో సీన్ లేనట్టే అన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. నిన్నటి వరకు పూరి జగన్నాథ్ ఈ లిస్టులో ఉంటే ఇప్పుడు శ్రీను వైట్ల వచ్చి చేరాడు. పూరి ఏకంగా వరుసగా నాలుగు డిజాస్టర్లు ఇచ్చాడు. శ్రీను వైట్లకు ఇది వరుసగా మూడో డిజాస్టర్.
వీళ్లంతా ఇలా వరుసగా ప్లాపులు ఇవ్వడానికి రీజన్ ఏంటన్న దానిపై కూడా ఇండస్ట్రీలో చర్చలు స్టార్ట్ అయ్యాయి. పూరి, శ్రీను వైట్ల రొటీన్ కథలే తీసుకుని రొటీన్ టేకింగ్తో సినిమాలు తీసేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఇడియట్ నుంచి రోగ్ వరకు చూస్తే ఏం అప్డేట్ కాలేదన్న విమర్శలు వచ్చాయి.
ఇక శ్రీను వైట్ల తన పాత సినిమాల్లోనే సీన్లనే అటూ ఇటూ తిప్పి తీసేస్తుండడంతో జనాలు అతడి సినిమాలను తిరస్కరిస్తున్నారు. కొత్త కథలు, కొత్త కథనాలపై అస్సలు వీరు హోం వర్క్ చేయడం లేదు. దీంతో పూరి, శ్రీను వైట్ల సినిమాలు జనాలకు అస్సలు ఎక్కడం లేదు. మిగిలిన డైరెక్టర్లను చూసి అయినా వీరు అప్డేట్ కావడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
శ్రీను వైట్ల అయినా తన సినిమాలకు కాస్తో కూస్తో ఒళ్లు దగ్గర పెట్టుకుంటున్నాడు ఏమోగాని పూరి జగన్నాథ్ అయితే వారం రోజుల్లో కథ రాసి రెండు నెలల్లో సినిమాను చుట్టేస్తున్నాడు. ఏదేమైనా వీరు ఫాంలోకి వచ్చి తలెత్తుకుని నిలబడాలంటే మరింతగా కష్టపడాల్సిందే.