‘బ్రహ్మూెత్సవం’ సినిమా ఫ్లాప్తో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ గ్రాఫ్లో భారీ పతనం చోటుచేసుకుంది. ఇంత వరకూ శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా, సమాజంలో ఏదో ఒక అంశాన్ని తీసుకుని జనాన్ని ఆలోచింపచేస్తాడు ఆ విషయంతో అనే టాక్ ఉంది ఈ డైరెక్టర్కి. అలాంటిది సూపర్ స్టార్తో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది. దాంతో చాలా నిరాశకు గురైన ఈ యంగ్ డైరెక్టర్ ఇంత వరకూ కొత్తగా ఏ సినిమాకీ ఓకే చెప్పలేదు. అంతేకాదు మహేష్త సినిమా భారీ అపజయంతో ఆయన్ని టాలీవుడ్లో అందరూ దూరంగా ఉంచుతున్నట్లుగా టాక్ వినవస్తోంది.
ఒక్క సినిమా ఫ్లాపుతోనే శ్రీనువైట్లలా తయారైంది శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి. అయితే శ్రీకాంత్ అడ్డాలపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఆయనకి పిలిచి ఆఫర్ ఇచ్చాడని సమాచారమ్. సాయిధరమ్ తేజతో సినిమా కోసం కథను రెడీ చెయ్యాల్సిందిగా దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాలకి సూచించాడట. దిల్ రాజుకీ, సాయి ధరమ్ తేజకీ మంచి ర్యాపో ఉంది. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు మరో సినిమాకి సై అంటున్నాడు సాయిధరమ్తో దిల్ రాజు. అయితే ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాలకు అవకాశం ఇవ్వడం వెనుక కూడా చాలా పెద్ద రీజనే ఉందట. జులై రెండో వారంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన రావొచ్చని అంచనా.