వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల – దిల్ రాజు చిత్రంలో సాయి పల్లవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.

మాలర్ పాత్రలో ప్రేమం చిత్రం ద్వారా యువత ను బాగా ఆకట్టుకున్న సాయి పల్లవి ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎంపిక చేయబడ్డారు. ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం”, అని తెలిపారు.

జూలై 25 న చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు చివరికి తెలంగాణా షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుని, అక్టోబర్ లో అమెరికా లో షూటింగ్ జరుపుతారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుంది. చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది

ఈ చిత్రానికి ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫి విజయ్ కుమార్ అందిస్తారు. ఇతర తారాగణం, మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.