బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో రానున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా. ఇందులో బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. శ్రియ ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యముందట. ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పాత్ర తరహాలో చాలా పవర్ఫుల్గా శ్రియ పాత్ర ఉంటుందని సమాచారమ్. అయితే ఆ పవర్ నటనలోనేనట. ఇంతవరకూ ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లో శ్రియ నటించలేదు. మరి ఇంత బరువైన పాత్రని శ్రియ ఎలా టేకప్ చేయగలుగుతుందో చూడాలి. అందుకోసం అలాంటి పాత్రల్లో నటించిన సీనియర్ హీరోయిన్స్ని తెగ ఫాలో అవుతుందట ముద్దుగుమ్మ శ్రియ.
పాత సినిమాల్లో వాణిశ్రీ, జయంతి, భానుమతి వంటి సీనియర్ నటీమణుల సినిమాలను బాగా చూస్తోందట. ఆ రకంగా తన ముఖంలో హావభావాలు పలికించేందుకు ప్రయత్నిస్తోందట. తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ కానుంది ఈ సినిమాలో తన పాత్ర. అందుకే ఇంత హార్డ్ వర్క్ చేస్తోందట. ఆల్రెడీ ఇలాంటి భారమైన క్యారెక్టర్లో బాలకృష్ణ సరసన నయనతార ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నటించింది. ఆ సినిమాలో సీత పాత్రలో ఆమె అమోఘమైన నటన కనబరిచింది. అందుకే ఆమెనే మొదట్లో ఈ క్యారెక్టర్కి ఎంచుకుందామని అనుకున్నారు. కానీ నయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ అదృష్టం శ్రియని వరించింది. తనకి దక్కిన ఈ గొప్ప అదృష్టాన్ని శ్రియ ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి మరి.