గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగ చైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది. మరో మూవీ మలయాళీ రీమేక్ ‘ప్రేమమ్’ కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలే కాక ఇప్పుడు చైతూ మరో రీమేక్పై కన్నేశాడు. ఆనంద్ కృష్ణన్ డైరెక్షన్లో వచ్చిన తమిళ్ రీమేక్ రైట్స్ను టాలీవుడ్లో ‘చుట్టాలబ్బాయ్’ ప్రొడ్యూసర్ దక్కించుకున్నారు. ఈ సినిమాను నాగచైతన్యతో నిర్మించాలని అనుకుంటున్నారట. సురేష్ కొండేటి సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోందట. ఈ సినిమాలో మళయాళీ ముద్దుగుమ్మ అను హీరోయిన్గా ఎంచుకున్నారని సమాచారమ్. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో చైతూ స్టార్డమ్కి తగ్గట్టుగా తెలుగులో కొన్ని మార్పులు చేయనున్నారట. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో చైతూ జర్నలిస్టుగా కనిపించనున్నారట. ఈ సినిమాపై చైతూ చాలా ఆశక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమా కోసం చైతూ, జర్నలిస్టులెలా ఉంటారు, వారి దైనందిన జీవితం ఎలా ఉంటుంది? విధి నిర్వహణలో వారెదుర్కొనే సమస్యలేంటి? వంటివి తెలుసుకుంటున్నాడట. మరో పక్క సమంతతో చైతూ లవ్ స్టోరీ పీక్స్కి చేరింది. ఎక్కడ చూసినా ఈ జంట చెట్టాపట్టాలేసుకుంటూ షికార్లు చేస్తున్నారు. తమపై వచ్చిన పుకార్లను కూడా పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరికీ వివాహం కూడా కానున్నదని టాక్. అయితే చైతూ తన తదుపరి సినిమా పెళ్లి తర్వాత చేస్తాడా? లేక ముందే చేస్తాడా? అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు.