ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్,మహేష్ లాంటి టాప్ హీరోలు కూడ అల్లుఅర్జున్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ క్రేజ్ కు…ఇపుడు తారక్ ఎలాగోలా అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడు.ప్రస్తుతం జూనియర్ ఎత్తుగడ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాలీవుడ్లో బన్నీ హల్చల్ భాగా ఎక్కువైంది.దీనికి అడ్డుకట్ట వేయాలంటే…. అటు మెగా కాంపౌండ్ వల్ల కూడా సాధ్యం కావడం లేదు. పవన్ చెర్రీలు కూడా బన్నీ మార్కెట్ ,క్రేజ్ చూసి స్టన్ అయిపోతున్నారు. తమిళ,మళయాలంలో కూడా బన్నీ మార్కెట్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాడు.దీనికి చెక్ పెట్టడానికి ఇక తారక్ మాత్రమే సెట్ అవుతాడని అంతా అంటున్నారు.అందుకు తారక్ అడుగులు అటువైపుగా పడుతున్నాయి.
తమిళ హీరోలకు కూడా మన టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. కానీ మన హీరోల్లో ఒక్క బన్నీకి మాత్రమే అక్కడ మంచి మార్కెట్ ఉంది.అయితే అల్లుఅర్జున్ మలయాళ సినిమారంగంలో చాలా మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. బన్నీకి ఉన్న డాన్స్ స్కిల్స్ వల్ల కేరళా రాష్ట్రంలోని యూత్ అల్లుఅర్జున్ ను మల్లు అర్జున్ అంటూ అభిమానంగా పిలవడమే కాకుండా అక్కడ అతడికి అభిమాన సంఘాలు కూడ ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉండగా ఈ మధ్యే విడుదలైన ‘సరైనోడు’ మలయాళ వెర్షన్ ‘యోధవు’తో అక్కడ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు వచ్చిన ఓపినింగ్ కలక్షన్స్ చూసి మలయాళ సినిమా రంగ టాప్ యంగ్ హీరోలు కూడ అధిరిపోయారు. ఇప్పుడు మలయాళ సినిమా రంగం పై మన జూనియర్ దృష్టి కూడా పడింది. ఎన్టీఆర్ కూడా కేరళలో బన్నీ తరహాలో చొచ్చుకెళ్లడానికి ప్లాన్ సిద్ధం చేసేసాడు.దానిలో భాగంగానే కొరటాలతో కలిసి మోహన్ లాల్ ను ఎంగేజ్ చేసుకుని ఆ యాంగిల్లో ట్రై చేస్తున్నారు.‘జనతా గ్యారేజ్’ లో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించడంతోనే ఈ సినిమాకు అక్కడ మార్కెట్ క్రియేట్ అయిపోయింది. తాజాగా మలయాళం కోసం తయారు చేసిన స్పెషల్ టీజర్ అక్కడ సంచలనాలు సృష్టిస్తోంది.
ఈసినిమా మార్కెట్ కోసం మోహన్ లాల్ ను బాగా ప్రమోట్ చేస్తూ కేరళాలో తన ఇమేజ్ బాగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు జూనియర్. ఎన్టీఆర్ మంచి డాన్సర్ కూడ కావడంతో కేరళా యూత్ ను తారక్ టార్గెట్ చేయడం ఖాయం అని అంటున్నారు. దీనికితోడు ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను కేరళాలోని తిరువనంతపురం కొచ్చిన్ లలో కూడ నిర్వహించే స్కెచ్ చూస్తూ… ఉంటే బన్నీ ఇమేజ్ కు జూనియర్ ఎర్త్ పెట్టడానికి రెడీగా ఉన్నాడా అన్న సందేహాలు అందరికీ వస్తున్నాయి.