బాలయ్యని క్రిష్ ఎం చెప్పి కన్విన్స్ చేసాడు?

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ యూరోప్ లోని జార్జియాలో తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యుద్ధసన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ నాథన్ జోన్స్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఐతే శాతకర్ణి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటిస్తుండగా.. ఆయన భార్య వశిష్టగా శ్రియ నటిస్తోంది. వీళ్లిద్దరి కుమారుడు ‘వాశిష్టపుత్ర పులోమావి’ పాత్ర కూడా సినిమాలో ఉందట. తొలుత ఈ రోల్ కి పలువురు యువనటులను అనుకున్నాడట డైరెక్టర్ క్రిష్. కానీ ఆ రోల్ లో ఏకంగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞనే నటింపజేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డైరెక్టర్ క్రిష్.. బాలకృష్ణను కన్విన్స్ చేసినట్లు సమాచారం.

మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేకంటే ఇలాంటి స్పెషల్ రోల్ లో సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకువస్తేనే బెటర్ అని బాలకృష్ణ కూడా భావిస్తున్నారట. అంటే మనంలో అఖిల్ ఎంట్రీ మాదిరిగానే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండే అవకాశముంది. ఈ వార్తల్లో నిజమెంతో తేలాలంటే చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ‘వాశిష్టపుత్ర పులోమావి’ రోల్ ఎలా ఉండబోతోంది. ఈ పాత్రలో మోక్షజ్ఞ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. ఈ వార్తల్లో నిజమున్నా.. లేకపోయినా.. నందమూరి అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు.