ఆ నిర్మాతే విష్ణుకి విలనయ్యాడు!

‘ఆడోరకం ఈడోరకం’తో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు..’లక్కున్నోడు’ అంటూ మరో మూవీ స్టార్ట్ చేశాడు. గీతాంజలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్వివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ నిర్మాతే విష్ణుకు విలన్గా మారాడట.

నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నాడని అంటున్నారు. గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్వివి సత్యనారాయణ ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అభినేత్రి సినిమా తెలుగు వర్షన్ నిర్మాణ పార్ట్‌నర్‌గా ఉన్నాడు.

మంచు విష్ణు హీరోగా ‘లక్కున్నోడు’నూ నిర్మిస్తున్నాడు. తన రెండో సినిమా శంకరాభరణంలో గెస్ట్ రోల్లో చేసిన సత్యనారాయణ ఇప్పుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో మెయిన్ విలన్గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.