సీఎం చెప్పారు సింధుది కర్ణాటక అట!

ఓ వైపు సింధు తెలంగాణా అమ్మాయని కాదు కాదు సింధునే స్వయంగా వాళ్ళ తాతగారిది విజయవాడ అని చెప్పాక ఆమెది ఆంధ్ర ప్రాంతమే అని అర్థం పర్థం లేని చర్చా.వాదోపవాదాలు జరుగుతుంటే ఆ సీఎం మాత్రం సరికొత్త చర్చని లేవదీశారు.ఆయనెవరరో కాదు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ .

అసలేం జరిగిందంటే మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పథకం సాధించిన సాక్షి మాలిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయే అన్న విషయం తెలిసింది.సాక్షిని సన్మానిస్తూ హర్యానా ముఖ్యమంత్రి రూ. 2.5 కోట్ల పురస్కారం అందించారు. అదే సందర్భం లో ఆయన ప్రసంగిస్తూ సింధు విషయం లో తడబడుతూ తప్పులో కాలేసాడు.

అసలు సీఎం గారు సింధు పేరు పలకడానికి నానాతంటాలు పడ్డాడు.ఆనక సింధుది కర్ణాటక అనేసరికి అక్కడికొచ్చిన వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు.అసలు సీఎం గారికి సింధు పేరే గుర్తు లేదు.అయినా మన రాజకీయ నాయకులకి ఇదేమైనా కొత్తా!సాక్షాత్తు కేంద్ర క్రీడా శాఖా మంత్రి దీపకర్మాకర్ పేరు మర్చిపోయాడంటే మన నాయకుల తీరేంటో అద్దం పడుతోంది.