ఎన్టీఆర్ – బాబి కాంబోలో వస్తోన్న జై లవకుశ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 21గా లాక్ చేశారు. ఇక ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోందని టాక్. రూ. 68 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఓవరాల్ ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 120 కోట్ల వరకు జరుగుతోన్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ.18 కోట్లతో కలుపుకుని కళ్యాణ్ రూ. 68 కోట్లు బడ్జెట్ ఫిక్స్ చేశాడట. ఇక శాటిలైట్ను రూ 16.5 కోట్లను, ఆడియోను 1.3 కోట్లకు ఇచ్చేశాడు. అదర్ లాంగ్వేజెస్ శాటిలైట్ రైట్స్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ద్వారా రూ. 9 కోట్లు సమకూరాయని తెలుస్తోంది.
నైజాం రైట్స్ పట్టేసిన దిల్ రాజు రూ. 18 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ఏరియాలు కలుపుకుంటే రూ. 38-40 కోట్ల మధ్యలో బిజినెస్ జరుగుతోందట. ఇక కర్ణాటక, ఓవర్సీస్, రెస్టాప్ ఇండియా రైట్స్ కలుపుకుంటే జై లవకుశ మొత్తం రూ. 120 కోట్లు బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.