ఎన్టీఆర్ బిగ్ బాస్ కు కాంట్ర‌వ‌ర్సీ కింగ్!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో ర‌చ్చోః ర‌చ్చ‌స్య ర‌చ్చోభ్యఃకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ‌కుశ సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యాక బిగ్ బాస్ షోకు ముంబైలో మ‌కాం వేసి షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ షో కోసం ముంబైలో పెద్ద సెట్టింగ్ కూడా వేస్తున్నారు.

తెలుగు బుల్లితెర చ‌రిత్ర‌లోనే దీనిని అతిపెద్ద రియాలిటీ షోగా దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌, ప్రోమో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో ఈ షో మేక‌ర్స్ మ‌రిన్ని ప్రోమోలు రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ షోలో కో యాంక‌ర్లుగా చేసేందుకు సుమ‌, అన‌సూయ చేతులెత్తేయంగా టాలీవుడ్ స్టార్ రైట‌ర్‌, క‌మెడియ‌న్ పోసాని సైతం కాల్ షీట్స్ ప్రాబ్ల‌మ్‌తో త‌ప్పుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎంపిక జ‌రుగుతోంది. హీరోయిన్ల మ‌ధుశాలిని, తేజ‌స్విని మాదివాడ‌ను ఎంపిక చేశార‌ట‌. ఇక ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్‌ను సైతం ఈ షోకు ఎంపిక చేసినా ఇప్పుడు అత‌డు ఆక‌స్మికంగా మృతి చెంద‌డంతో కొత్త వారిని ఎంపిక చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే ఈ షోలో ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త‌బోధ‌కుడు కేఏ.పాల్ పాల్గొంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పాల్ అంటేనే కాంట్ర‌వ‌ర్సీల‌కు మారుపేరు. మ‌రి పాల్ ఈ షోలో పాల్గొంటే ఇక్క‌డ ఇచ్చే ట‌ఫ్ టాస్క్‌ల‌కు ఆయ‌న ఎంత ర‌చ్చ చేస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.