టీటీడీపీ నేతలు చేసేది ఏమిలేక స్క్రిప్టుని చెత్త బుట్టలో పడేశారా!

ఎవ‌డు కొడితే.. దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడేరా.. పండు గాడు! ఇది ఓ మూవీలో మ‌హేష్ బాబు డైలాగ్‌. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేసి చూపించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. నిత్యం ఏదో ఒక విష‌యంపై కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్న తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు కేసీఆర్‌! ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. తెలంగాణలో భారీ భూ క‌బ్జా ఒక‌టి తెర‌మీ ద‌కి వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు అనేక స‌మ‌స్య‌ల విష‌యంలో కేసీఆర్ స‌ర్కార్‌ని ఇరుకున పెడుతున్న టీడీపీ నేత‌లకు ఈ అవ‌కాశం అందివ‌చ్చింద‌ని భావించారు. ఇక‌, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అయితే… మ‌రీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో భూ క‌బ్జా విష‌య‌మై కేసీఆర్‌కి గ‌ట్టిగా బుద్ది చెప్పాల‌ని అంద‌రూ ప‌క్కాప్లాన్‌తో స్కెచ్ గీసేశారు. కానీ, ఇంత‌లోనే క‌థ అడ్డం తిరిగింది. ఈ భూ క‌బ్జా కేసులో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ.. దీప‌క్‌రెడ్డి..ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక్క‌సారిగా టీ టీడీపీ నేత‌ల మైండ్ చెదిరిపోయింది.

ఇంత వ‌ర‌కు టీఆర్ ఎస్ అధినేత‌ను ఏకేసేందుకు రెడీ చేసుకున్న స్క్రిప్టును చెత్త కుండీలో ప‌డేసి.. భ‌విష్య‌త్తు ఏంట‌ని త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో కేసీఆర్‌పై దూకుడు పెంచాల‌ని భావిస్తున్న స‌మ‌యంలో ఇలా రివ‌ర్స్ స్టోరీ ప్లే కావ‌డంతో టీ టీడీపీ ఏం చేయాలో తెలియ‌క త‌ల్ల‌డిల్లిపోతోంది. నిజానికి ఈ భూ క‌బ్జాను అడ్డం పెట్టుకుని కేసీఆర్‌పై దుమ్ము రేపాల‌ని నిర్ణ‌యించారు తెలుగు త‌మ్ముళ్లు.

అయితే, తాజాగా దీపక్ రెడ్డి చిన్న చేప మాత్రమేనని ఇంకా తిమింగలాలు చాలా ఉన్నాయని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత స‌ర్ది చెప్పినా.. కేసీఆర్ దెబ్బ‌కి.. టీ టీడీపీ కొన్ని నెల‌ల పాటు తేరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని అంటు న్నారు విశ్లేష‌కులు!!