టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు క్రేజ్ మూడు హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలతో ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీమంతుడు ఏకంగా రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకే పెద్ద షాక్ ఇచ్చింది. ఇక గతంలో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్లో కూడా నిలిచాడు. కట్ చేస్తే 2016లో ఈ లిస్టులో 6వ ప్లేస్కు పడిపోయిన మహేష్ ఈ యేడాది ఏకంగా 7వ ప్లేస్తో సరిపెట్టేసుకున్నాడు.
ఈ యేడాది ఈ లిస్టులో నెంబర్ వన్గా మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ ఉండగా తరువాత వరుసగా విరాట్ కోహ్లి, హృతిక్ రోషన్, రన్వీర్ సింగ్, ఫవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్నారు. ఇక సౌత్లో బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 22వ స్థానం, బాహుబలి సినిమా తర్వాత భళ్లాలదేవుడిగా మార్మోగుతోన్న రానా 24, కోలీవుడ్ హీరో ధనుష్ 26వ స్థానంలో ఉన్నారు.
ఇక మహేష్ క్రేజ్ తగ్గడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మహేష్ను మహేష్ అభిమానులే తిట్టుకున్నారు. గత సినిమాలతో మహేష్కు వచ్చిన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది.
ఇక ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న స్పైడర్ సినిమా కూడా చాలా లేట్ అవుతోంది. యేడాది కాలంగా మహేష్ సినిమా లేకపోవడం, బ్రహ్మోత్సవంతో ప్లాప్లో ఉన్నందున మహేష్ క్రేజ్ కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. ఇక సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది.