టాలీవుడ్లో దసరా వేదికగా ఇద్దరు అగ్ర హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. దసరా బరిలోనే ఏకంగా ముగ్గురు అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. బాలయ్య పైసా వసూల్ సెప్టెంబర్ 29న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఎన్టీఆర్ జైలవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేష్-మురుగదాస్ కాంబోలో వస్తోన్న స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ మారుస్తారని అనుకున్నా ఆ సినిమా సైతం సెప్టెంబర్ 27న డేట్ లాక్ చేసుకుందని లేటెస్ట్ అప్డేట్.
స్పైడర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నిర్మాత ఠాగూర్ మధు కలిసి ఈ మేరకు డిస్కషన్లు జరిపి ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ల లెక్క వాళ్లకు ఉంది. 27 నుంచి వరుసగా ఆరు రోజులు సెలవులు వస్తున్నాయి…ఇంత లాంగ్ వీకెండ్ ఎప్పుడూ రాదని డిసైడ్ అయ్యి స్పైడర్ను ఆ డేట్కే లాక్ చేశారట.
ఇక జైలవకుశ నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజే. దీంతో ఇద్దరు అగ్ర హీరోలు మరో సీనియర్ హీరో ముగ్గురూ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడితే ఆ ఎఫెక్ట్ వాళ్ల సినిమాల కలెక్షన్లపై తప్పకుండా ఉంటుంది. ఈ టైంలో మహేష్, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ లేదు కదా..? వీరు ఓ సారి మాట్లాడుకుని ఎన్టీఆర్ ఓ వారం ముందు వచ్చేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందని కదా ? అన్న చర్చలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి.