హ‌రీష్ శంక‌ర్ ఆగ‌ట్లేదుగా… కొత్త స‌వాల్‌

అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసిందో రిలీజ్ త‌ర్వాత కూడా అంతే కాంట్ర‌వ‌ర్సీల‌తో ముందుకు వెళుతోంది. ఈ సినిమాకు ఫ‌స్ట్ షోకే మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వ‌చ్చాయి. సినిమా రొటీన్ క‌థ‌తో ఉండ‌డంతో త‌ర్వాత ప్రేక్ష‌కులు మొఖం చాటేశారు. సినిమా ముందు మూడు రోజుల త‌ర్వాత తేలిపోయింది.

వాస్త‌వంగా డీజే వ‌సూళ్లు ఇలా ఉంటే డీజే టీం మాత్రం ఫ‌స్ట్ వీక్‌లోనే డీజే సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని ప‌బ్లిసిటీ చేసుకుంటోంది. డీజే టీం చెపుతోన్న రికార్డుల‌కు లెక్కే లేదు. డీజే వ‌సూళ్ల‌పై మీడియా, సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం కూడా మొద‌లైంది. దీనిపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ఇప్ప‌టికే చాలా స‌వాళ్లు చేశాడు. ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉంద‌ని గొప్ప‌లు పోయాడు. మీడియాకు నీతి క‌బుర్లు చెప్పాడు.

హ‌రీశ్ శంక‌ర్ డైలాగులు ఎలా ఉన్నా వాస్త‌వంగా డీజే సినిమాకు అంత సీన్ లేద‌ని క్రిటిక్స్‌, ట్రేడ్ రెండూ తేల్చేశాయి. మ‌హా అయితే యావ‌రేజ్ లైన్‌కు కాస్త పైన ఈ సినిమా ఆగుతుందేమో అంటున్నారు. డీజేపై వ్య‌తిరేక ప్ర‌చారం ఆగ‌క‌పోవ‌డంతో ఈ చిత్ర యూనిట్ గురువారం మ‌రో కొత్త రికార్డు అంటూ ఓ ప్ర‌క‌ట‌న చేసేసింది.

డీజే సినిమాకు మొదటి 13 రోజులకు కలిపి నైజాంలో రూ. 20 కోట్ల షేర్ వ‌చ్చిన‌ట్టు ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఇది బ‌న్నీకి నైజాంలో మొద‌టి రూ. 20 కోట్ల సినిమా అయితే, హ‌రీష్ శంక‌ర్‌కు రెండోది. ఈ క్ర‌మంలోనే హ‌రీష్ మ‌రోసారి మీడియాపై రెచ్చిపోయాడు. ఈ లెక్క‌లు అబ‌ద్ధ‌మ‌ని ఎవ‌రైనా ఫ్రూవ్ చేస్తే సినిమాలు మానేస్తాన‌ని కూడా స‌వాల్ చేశాడు. కొంద‌రు అబద్ధ‌పు రాత‌ల‌తో త‌మ‌ను అవ‌మానిస్తుండ‌డంతో ఇలా ట్వీట్ చేస్తున్నాన‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.