ప్రముఖ మళయాళ నటుడు దిలీప్ వ్యక్తిగత కక్షతోనే భావనపై లైంగీక దాడి చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దిలీప్ భావన కెరీర్ను నాశనం చేయాలన్న ప్లాన్తోనే చివరకు జైలు పాలయ్యే వరకు వచ్చాడని కేరళ పోలీసులు చెపుతున్నారు. దీనికోసం దారుణమైన ప్లాన్ వేసిన దిలీప్ కోటిన్నర వరకు ఖర్చుపెట్టి భావనపై దాడి చేయించాడట. మరి భావనపై దిలీప్ ఇంత దారుణంగా కక్షకట్టడం వెనక దిలీప్ వివాహేతర సంబంధమే కారణమని తేలిందట.
ఈ మ్యాటర్ ఇలా ఉంది. దిలీప్కు చాలా రోజులుగా కావ్య మాధవన్తో అక్రమ సంబంధం ఉంది. మంజూవారియర్ అనే హీరోయిన్ను దిలీప్ అప్పటికే పెళ్లి చేసుకున్నా కావ్యతో మాత్రం ఈ సంబంధం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కావ్యతో దిలీప్ చాటుమాటు వ్యవహారాలను భావన ఎప్పటికప్పుడు దిలీప్ భార్య మంజూకు చేరవేస్తుండేది. దీంతో మంజూ విసిగిపోయి చివరకు దిలీప్కు విడాకులు ఇచ్చింది.
అప్పటికే కావ్య కూడా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దిలీప్ – మంజూ విడిపోవడతో కావ్య కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కావ్య – దిలీప్ పెళ్లి చేసుకున్నారు. దిలీప్, కావ్యను పెళ్లి చేసుకున్నా భావనపై ఉన్న కసిని మర్చిపోలేదు. ఈ క్రమంలోనే భారీగా ఖర్చుకు సైతం వెనకాడలేదు. భావన కెరీర్ను నాశనం చేసే పనిని ఆమె డ్రైవర్, మాజీ డ్రైవర్లకు ఈ పని అప్పజెప్పాడు.. చివరకు దాడిని చేయించగలిగాడు.