టాలీవుడ్లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ ఇష్యూలో సిట్ అధికారులు వరుసగా పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ 8వ రోజు ప్రముఖ ఐటెం గర్ల్ మమైత్ఖాన్ను విచారిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న మమైత్కు పోలీసులు ప్రత్యేకంగా వెళ్లి మరీ నోటీసులు జారీ చేశారు. ఇక గురువారం
పవన్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు మహిళా అధికారుల బృందం మమైత్ను విచారిస్తోంది. మమైత్పై సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
నాంపల్లిలోని అబ్కారీ భవన్కు మమైత్ ఉదయం 9.30 గంటలకే చేరుకున్నారు. ఆమె విచారణ 10.30 గంటలకు ప్రారంభమైంది. ఇక సిట్ అధికారులు మమైత్ను పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ముంబైలో చాలా రోజులు ఉన్నారు కదా ? అక్కడ డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా ? అన్న ప్రశ్నతో ప్రారంభించి ఆమెకు పలు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.
మమైత్ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నట్టు సమాచారం.
– మీతోనే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా ?
– మీరు డ్రగ్స్ అమ్మకాలు జరిపారా..? తీసుకున్నారా..?
– మీకు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మీతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది ?
– పోకిరి సినిమాతోనే మీరు పూరీకీ క్లోజ్ అయ్యారా ? ఆ తర్వాతనా ?
– టాలీవుడ్కు రాకముందు మీరు ఏం చేసేవారు ?
– మీరు హైదరాబాద్ వదిలి ముంబై ఎందుకు వెళ్లారు ?
– మీకు పబ్లకు వెళ్లే అలవాటు ఉందా..?
– మీరు ఖాళీ సమయాల్లో ఎక్కడ ఎక్కడ గడిపేవారు ?
– ఐటెం సాంగ్స్ చేసే మీరు తరచూ బ్యాంకాంగ్కు ఎందుకు వెళ్లేవారు ?
– హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు వీకెండ్ ఎంజాయ్మెంట్ ఎవరెవరి పబ్లకు వెళ్లేవారు ?
– తరుణ్, నవదీప్ పబ్లకు ఎన్నిసార్లు వెళ్లారు ?
– కెల్విన్తో మీ పరిచయం ఎలా జరిగింది ? మీ మధ్య సంబంధాలు ఏంటి ?
ఇక సిట్ విచారణలో పలు ప్రశ్నలకు మమైత్ చాలా కాన్ఫిడెన్స్గానే సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఆమె నేరుగా బిగ్ బాస్ షో నుంచి ఈ షోకు వచ్చింది. ఆమెతో పాటు బిగ్ బాస్ నుంచి కొందరు ప్రతినిధులు కూడా ఇక్కడకు వచ్చారు.