ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో విజయ్ మెర్సల్ (తెలుగులో అదిరింది) పెద్ద సెన్షేషనల్ న్యూస్గా మారింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ తేనాండల్ ఫిలింస్ సంస్థ తమ బ్యానర్లో ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా నిర్మిస్తోంది. రాజా రాణి, తెరి (తెలుగులో పోలీస్) లాంటి వైవిధ్యమైన చిత్రాలు నిర్మించిన అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది.
ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్తో పాటు శాటిలైట్ రైట్స్ బిజినెస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానెల్ రూ.30 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఇక థియేట్రికల్ రైట్స్ కూడా అంతే రేంజ్లో అమ్మకాలు జరుగుతున్నాయట. సౌత్ ఇండియాలో విజయ్కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ సినిమాతో మరోసారి స్పష్టమవుతోంది. విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.