దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన్మథుడిగా, కింగ్గా టాలీవుడ్ అభిమానుల మనస్సు దోచుకున్నాడు. సినిమాల్లోను, బయటా నాగార్జున వ్యక్తిత్వం కాస్త భిన్నం. వివాదాలకు దూరంగా అందరితోను సమన్వయంతో ముందుకు వెళ్లే నాగ్ది పక్కా బిజినెస్ మైండ్ అన్న టాక్ ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి చాలా రెట్లు ఎలా రాబట్టుకోవాలో నాగ్కు బాగా తెలుసు.
ఇక తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోనే నాగ్ అక్రమ ఆస్తులు, కట్టడాలను టార్గెట్ చేశారు. కానీ ఎన్నికలై కేసీఆర్ సీఎం అయ్యాక ఆయన నాగ్ ఆస్తుల విషయంలో ముందు కూలగొడతామంటూ హడావిడి చేసినా తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత నాగ్-మంత్రి కేటీఆర్ మంచి దోస్త్లు అవ్వడం, తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నాగ్కు కాబోయే కోడలు సమంతను ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు నాగ్ ఇప్పుడు అత్యంత సన్నిహితుడు అయిపోయాడు. అక్కడ నాగ్ ఆస్తులకు వచ్చిన ఇబ్బందేమి లేదు. ఒకటి రెండు అక్రమ కట్టడాలు ఉన్నా ఆయన ఏదోలా క్రమబద్ధీకరించేసుకుంటాడు. ఇక ఇప్పుడు ఏపీలో రాజధాని కేంద్రంగా చుట్టుపక్కల పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం నాగ్కు ఉంది. నాగ్ వ్యాపార సన్నిహితులందరూ వైసీపీ అధినేత జగన్కు కావాల్సిన వారే.
ఈ క్రమంలోనే నాగ్ ఏపీలో రాజకీయంగా వైసీపీకి దగ్గరవుతోన్నట్టు తెలుస్తోంది. వైఎస్ ఉన్నప్పటి నుంచే ఆ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నాగ్ ఆ తర్వాత జగన్తో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న ప్రచారం కూడా ఉంది. ఇక వీరిద్దరికి వ్యాపారంలో ఉన్న కామన్ ఫ్రెండ్స్ నాగ్ను వైసీపీలోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీలో చేరే నాగార్జున గుంటూరు లేదా విజయవాడ లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి ఎంపీగా పోటీ చేసే ఆఫర్ కూడా జగన్ ఇచ్చినట్టు ఇన్నర్ టాక్.
విజయవాడ లేదా గుంటూరు ఎంపీగా ఉంటే రాజధాని కేంద్రంగా ఏపీలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్లాన్లో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా నాగార్జున వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తే ఏపీలో వైసీపీకి అది చాలా బూస్టప్ అవుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి సైతం ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చన్న టాక్ వస్తోంది. మరి వీరిద్దరి మధ్య నిజంగానే పోటీ అంటూ జరిగితే ఎంత రసవత్తరంగా ఉంటుందో ఊహకే అందడం లేదూ కదూ..!