
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు కరోనా పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక దేశాలన్నీ అన్లాక్ ప్రక్రియ స్టాట్ చేశాక కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మళ్లీ పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 44,489 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,66,706 కి చేరింది. అలాగే నిన్న 524 మంది కరోనా కారణంగా మరణించారు.
తాజా లెక్కలతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,35,223 కి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 36,367 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,79,138 మంది కోలుకోగా.. 4,52,344 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో 10,90,238 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పుడు వరకు మొత్తం టెస్ట్ల సంఖ్య 13,59,31,545 కి చేరింది.