
ఓ శునకం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న శవాన్ని తినేందుకు ప్రయత్నించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం నాడు చోటు చేసుకున్న ఈ సంఘటనపై అక్కడి ప్రజలు తీవ్ర కోపం చూపుతున్నారు.రోడ్డు ప్రమాదానికి గురైన ఓ చిన్నారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు, కాని ఆ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. తెల్లని గుడ్డలో చుట్టి ఉన్న ఆ శవాన్ని హాస్పిటల్ లో ఓ మూల స్ట్రెచర్పై ఉంచారు.
హఠాత్తుగా దానిని ఓ వీధికుక్క పీక్కు తినడానికి ప్రయత్నించినా ఓ వీడియో ఇప్పుడు సోషల్సం మీడియాలో బాగా వైరల్ అయ్యింది. 20 సెకన్ల సాగే ఈ వీడియోను సమాజ్వాదీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ చిన్నారి కుటుంబానికి సంతాపం తెలియచేస్తూ, ఈ సంఘటనకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలంటూ వారు కోరారు.
संभल में स्वास्थ्य सेवाओं की रोंगटे खड़े कर देने वाली खौफनाक तस्वीर आई सामने।जिला अस्पताल में स्वास्थ्य कर्मियों की लापरवाही की वजह से स्ट्रेचर पर रखे बच्ची के शव को कुत्तों ने नोच कर खाया। जांच करा लापवाही बरतने वालों के खिलाफ हो सख्त कार्रवाई। शोकाकुल परिवार के प्रति संवेदना! pic.twitter.com/3tgEHCTQpb
— Samajwadi Party (@samajwadiparty) November 26, 2020