
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు కరోనా పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక దేశాలన్నీ అన్లాక్ ప్రక్రియ స్టాట్ చేశాక కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఇదిలా ఉంటే.. భారత్లో నిన్న కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 14,545 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,25,428 కు చేరింది. అలాగే నిన్న 163 మంది కరోనా కారణంగా మరణించారు. తాజా లెక్కలతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,53,032 కి పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 18,002 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,83,708 మంది కోలుకోగా.. 1,88,688 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న ఒక్క రోజే 8,00,242 కరోనా టెస్ట్లు నిర్వహించగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్ల సంఖ్య 19,01,48,024 కు చేరుకుంది.