
కరోనా కారణంగా చాల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రొమ్ హోమ్ చేస్తున్నారు. ఇక రెండు గంటలపాటు ఒకేచోట కూర్చొని పనిచేయడం చాలా డేంజర్ అని శాస్త్రవేత్తలు అటున్నారు. రోచెస్టర్ మిన్నెసోటాకు చెందిన మయో వైద్యులు ఇటీవల ఈ అంశంపై పరిశోధన సాగించారు. ఒకే చోట కూర్చొని పరిశోధన చేసేవాళ్ల మీద వాళ్ల పరిశోధనలు సాగాయి.
కూర్చొని పనిచేసేవాళ్లకు హృద్రోగాలు ఆస్తమా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధన తేల్చింది. దాదాపు 2వేల మందికి పై పరిశోధన సాగించారు. అయితే ఒకేచోట కూర్చొని పనిచేసేవాళ్లు కచ్చితంగా రెండు గంటలకు ఓ సారి .. లేచి వాకింగ్ చేయాలని వాళ్లు సూచిస్తున్నారు. అయితే ఎంత పని ఒత్తిడి ఉన్నా కచ్చితంగా కుర్చీలోంచి లేవడం మర్చిపోకూడదని సూచిస్తున్నారు. ప్రతిరోజు వాకింగ్ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్లే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే. బీపీ వస్తుంది కొవ్వు పేరుకుపోతుంది గుండె జబ్బులు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూర్చొని పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.