డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ తేదీన రాజస్థాన్ నుండి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న అజాజ్ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు ఆయన్ని ప్రశ్నించారు. ఆ తరువాత అతడిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే డ్రగ్స్ పెడ్లర్ ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు ఖాన్ పేరు చెప్పడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని అధికారులు విచారించారు. ఇక బాలీవుడ్ నటుడికి సంబంధం ఉన్న అంధేరి, లోకండ్వాలా ఏరియాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఫరూఖ్ బటాటాను నిన్న 8 గంటల పాటు విచారించారు. బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2018లోనూ డ్రగ్స్ కేసులో, ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు షేర్ చేసినందుకు గాను 2020, ఏప్రిల్లో అతని అరెస్ట్ చేసారు.