డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వటంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు అజాజ్ ఖాన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అజాన్ ఖాన్ను విచారించిన బృందం కూడా కరోనా టెస్ట్స్ చేయించుకోనుంది.
మార్చి 30 న రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్న అతడిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు విచారించి అరెస్టు చేసినట్లు అధికారులు అధికారికంగా తెలిపారు. డ్రగ్స్ పెడ్లర్ అయిన ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు అజాజ్ ఖాన్ పేరు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంకా అంధేరి, లోకండ్వాలా ఏరియాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు కూడా జరిపారు.