క‌రోనా కాటు..ప్ర‌ముఖ హీరోయిన్ భ‌ర్త మృతి!

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో అర్థం కావ‌డం లేదు. తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ మాలా శ్రీ భ‌ర్త కుణిగల్ రాము కూడా క‌రోనా కాటుకు బ‌లైపోయారు.

Veteran actress Malashree's husband passed away

రాముకు కొన్ని రోజుల కింద‌టే క‌రోనా వైర‌స్ సోక‌గా.. బెంగళూరు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. తాజాగా ఆయ‌న క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 52 సంవ‌త్స‌రాలు. దీంతో మాలాశ్రీ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

ప్ర‌స్తుతం రాము మ‌ర‌ణంపై ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చుకున్న రాము ఏకే 47, లాకప్ డెత్, కలాసిపాళ్యా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించాడు. ఇక ఆయన భార్య మాలాశ్రీ తెలుగు ప్రేక్షకుల సుపరిచితమే. ఈమె కన్నడ, తమిళ భాషలలో కూడా టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.