కరోనా కారణంగా గత ఏడాది చాలా మంది మృత్యువాత పడ్డారు.ఇంకొందరు ఇతర కారణాల వలన చనిపోయారు. తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ తాతగారు సౌందరా పాండియన్ మృతి చెందారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు దర్శకుడు అట్లీ. తాత ఎం సౌందరా పాడియన్ చనిపోయారు. మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు.
ఆయనంటే నాకు చాలా ఇష్టం. తాత మీరు ఎల్లప్పుడు నా రోల్ మోడల్ లవ్ యూ, మిస్ యూ. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అంటూ అట్లీ తన ట్వీట్ ద్వారా తెలిపారు. కాగా, శంకర్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా కేరీర్ మొదలు పెట్టారు అట్లీ. ఆ తర్వాత దర్శకుడిగా పరిచయమాయ్యాడు. త్వరలోనే విజయ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.