తెలంగాణ ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్…!?

కరోనా కారణంగా అన్ని ప్రైవేట్ స్కూళ్లు క్లోజ్ అవ్వటంతో ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000 రూపాయలు, ఇంకా ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించనున్నట్టు ఇప్పటికే కెసిఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రభుత్వవం అందించే ఈ ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ అయింది.

మొత్తం 1,18,004 మందిని సాయం కోసం ఎంపిక చేశారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఎంపికైన వారికి ఈ మంగళవారం అంటే రేపటి నుంచి నుంచి రూ. 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనున్నారు. 21వ తేదీ నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేస్తారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని రెడీ చేసింది.