శుభ వార్త : కరోనా వైరస్ కు హోమియోపతి వ్యాక్సిన్..!

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో దానికి చెక్ పెట్టేందుకు భారత్ మరో అడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్ తో కరోనాను తరిమేందుకు రెడీ అయింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు. భారత్ మాత్రం ఇప్పుడు హోమియో టీకా ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసారు. ఈ వ్యాక్సిన్ 62 శాతం ప్రభావం చూపుతుందని ఆ సంస్థ అధిపతి డాక్టర్ రాజేష్ చెప్పారు.

వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తమ సోనోడ్ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు. క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని, త్వరలోనే అందరికి ఈ వాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని హోమియో నిపుణులు అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ లో రెండు టీకాలను ఇస్తున్నారు. తాజాగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. దీనికి సోనోడ్ కూడా తోడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగవచ్చు.