ఓటీటీలో ‘జగమే తంత్రం’..!?

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ప్రధాన పాత్రలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జగమే తంత్రం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ రిలీజ్ఖ డేట్ ఫిక్స్ అయింది. జూన్‌ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో ధనుష్‌ సరసన ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటించింది. జేమ్స్‌, కాస్మో, జొజూ జార్జ్‌, కలైయారసన్‌, సౌందరరాజన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందించారు.

శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు. ఈ చిత్రం మే 1న విడుదల థియేటర్లలో కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో మూవీ విడుదల తేదీని మారుస్తూ చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.