మరో నాలుగు రోజుల్లో ప్రైమ్‌లో రానున్న జాతిరత్నాలు..!?

ఈ మధ్య కాలంలోప్రేక్షకుల్ని బాగా నవ్వించిన చిత్రం జాతిరత్నాలు. కథ కంటే కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టిన డైరెక్టర్‌ అనుదీప్‌ ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో విజయం సాధించాడు. మార్చి 11న విడుదల అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది.

ప్రధాన తారాగణం అయిన నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇకపోతే కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీ లో హ్యాపీగా వీక్షించవచ్చు. అందరు జాతిరత్నాలు ఓటీటీ లో ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది. జాతిరత్నాలు సినిమా ఏప్రిల్‌ 11 నుంచి స్ట్రీమ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అంతా ఆనందం వ్యక్తం చేచేస్తున్నారు. మరికొందరు ఈ సినిమాని హిందీ, కన్నడ భాషలో డబ్బింగ్‌ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు.