కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్లో మార్మోగిపోతుంది.
ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మరియు రామ్ సరసన ఓ చిత్రంలో కృతి నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ బాలాజీ మోహన్ కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టిని హీరోయిన్గా ఎంపిక చేశారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. కాగా, కోలీవుడ్లో కృతికి ఇదే మొదటి సినిమా. ధనుష్ లాంటి స్టార్ హీరోతో కృతి కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం నిజంగా విశేషమే.