ఫ్లాష్ : ధోనీ తల్లిదండ్రులకి కరోనా పాజిటివ్…!

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్‌ ధోని ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ధోని తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ధోని ప్రస్తుతం సీఎస్‌కేలో బిజీగా ఉన్నాడు.ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుంది.

ఇక, బయో బబుల్‌ నిబంధనల నడుమ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సూపర్‌కింగ్స్‌ లీగ్‌ దశలోనే వెనుదిరగడం టోర్నీ చరిత్రలో అదే ఫస్ట్ టైం. టోర్నీ మొదలు కాకముందే ప్లేయర్స్ కరోనా బారిన పడటం జట్టు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనితో ప్రస్తుతం ఎంఎస్ ధోని తన కుటుంబానికే తన టైం అంతా కేటాయిస్తున్నాడు.