అరుదైన గౌర‌వం అందుకున్న `గాలి సంపత్`!

రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు కీల‌క పాత్ర‌లో అనీష్ తెర‌కెక్కించిన చిత్రం `గాలి సంప‌త్‌`. తండ్రీకొడుకుల ఎమోషనల్ జర్నీనే ఈ సినిమాకు కథాంశం. ఈ చిత్రంలో గాలి సంప‌త్ పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించ‌గా.. ఆయ‌న కొడుకు పాత్రలో శ్రీ విష్ణు న‌టించారు.

నోట మాట రాకున్నా స‌రే, ఫీ..ఫీ..ఫీ అని నోటి నుంచి గాలి ఊదుతూ ముఖంలోని హావభావాలతోనే ప్రేక్షకుడిని అల‌రించ‌డం మామూలు విష‌యం కాదు. కానీ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసి చూపించారు. గాలి సంప‌త్ పాత్ర‌లో జీవించేశారు.

అందుకే తాజాగా ఆయ‌న‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ‘గాలి సంపత్ చిత్రంలో తన నటనకు గాను రాజేంద్ర ప్రసాద్.. ఉత్తమ నటుడి అవార్డును అందుకోనున్నారు. ప్రముఖ సాహితీ సంస్థ ‘బల్లెం వేణుమాధవ్‌ ఆర్ట్‌ థియేటర్‌’ సినీ ప్రముఖులకు అవార్డులను ప్రకటించగా, బెస్ట్ యాక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ నిలిచారు.