రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన `పుష్ప`, శర్వానంద్ సరసన `ఆడాళ్ళూ మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది.
అలాగే `మిషన్ మజ్ను` మూవీ తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మిక.. ఈ సినిమా పూర్తి కాకముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో నటిస్తున్న `గుడ్ బాయ్` సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వికాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండగా.. ఆయన కూతిరి పాత్రలో రష్మిక కనిపించనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది రష్మిక.
అమితాబ్తో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెబితే.. రష్మికను తన తల్లిదండ్రులు అస్సల నమ్మలేదట. ఆ తర్వాత నిజం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారట. అంతేకాదు, రష్మిక అమ్మా, నాన్న.. బిగి బికి బిగ్ ఫ్యాన్స్ అట. ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తుంటారట. అలాంటి లెజెండరీ నటుడితో తమ కూతురు కలిసి నటించబోతుందని హ్యాపీగా ఫీల్ అయ్యారట.