కరోనా వైరస్ బారిన పడ్డ వారికీ సాయంగా మిషన్ ఆక్సిజన్ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతు సాయంగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ తన ట్విట్టర్లో వెల్లడించారు.
250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ వైరస్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు పని చేస్తోంది. దేశంలో మొదటిసారి కరోనా ప్రమాదం వచ్చినప్పుడు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన సచిన్ ఇప్పుడు మరోకసారి తన ఉదారత్వాని చాటుకోవడంతో సచిన్ ఫాన్స్ అంతా తన పై ప్రశంసల వాన కురిపిస్తున్నారు. మిగతా క్రికెటర్లు కూడా తమ వంతు సాయం చేయాలంటూ, మరికొందరు కామెంట్స్ ద్వారా కోరుతున్నారు.