సిద్ధార్థ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న సిద్ధార్థ్.. ఆ తర్వాత తెలుగులో ఏవో కొన్ని సినిమాలే చేశాడు. కానీ, కోలీవుడ్లో మాత్రం ఫుల్ బిజీ అయ్యాడు. అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం మరచిపోయాడు.
అయితే మళ్లీ చాలా కాలం తర్వాత `మహాసముద్రం` సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సిద్ధార్థ్.. తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వంలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లక్ను విడుదల చేయగా.. ఆ పోస్టర్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ట్రాఫిక్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల సిద్ధం అవుతోంది.