మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లోనూ కూడా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
ఇక ప్రస్తుతం గోపీచంద్ సరసన `సీటీమార్`, వెంకీ-వరుణ్ హీరోలుగా తెరకెక్కుతున్న `ఎఫ్3`, సత్యదేవ్ సరసన `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో తమన్నా నటిస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `లెవెంత్ అవర్` అనే వెబ్ సిరీస్లో కూడా తమన్నా నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ఏప్రిల్ 9న విడుదలైంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉండే తమన్నా.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా లేత గులాబీ రంగులోని పర్పుల పువ్వుల ఫ్రాక్లో అందంగా ముస్తాబైన ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడీ డ్రస్ ఖరీదు హాట్ టాపిక్గా మారింది.తమన్నా డ్రెస్సును ప్రముఖ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ రూపొందించగా.. దాని ధర అక్షరాల రూ.51,244 అని ప్రచారం జరుగుతోంది.
https://www.instagram.com/p/CNctteYhLHo/?utm_source=ig_web_copy_link