ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ చేశారు . జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించ బోతున్నట్లు ఆయన తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుందని ఆయన తెలిపారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా ఉన్నాయి. మొత్తం ఏడు పేపర్లు. జూన్ 7 అంటే సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 8 మంగళవారం నాడు సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9 బుధవారం: ఇంగ్లీష్ ,జూన్ 10 గురువారం: గణిత పేపర్, జూన్ 11 శుక్రవారం: ఫిజికల్ సైన్స్, జూన్ 12 శనివారం: బయోలాజికల్ సైన్స్, జూన్ 14 సోమవారం : సోషల్ స్టడీస్.