అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసారు. మరి ఇటువంటి సమయంలో అసలు ఆ ప్రాజెక్ట్ ఉందా లేదా అని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం వాటని ఒట్టి సుత్తి రూమర్స్ అంటూ కొట్టి పారేసినట్టు తెలిసింది. అంతే కాకుండా ఆల్రెడీ అన్ని పనులు బాగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. సో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉందనే చెప్పచు.