ప్రతిష్ఠాత్మతంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్ర రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఇంకా ఈమధ్య ఆయన్ని కలిసిన వారంతా ఐసోలేషన్కు వెళ్లాలని ఆయన సూచించినట్లు వారు తెలిపారు.
ఈమధ్య కాలంలో చెన్నైలో జరిగిన తలైవి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఇటీవల పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు కనిపించటంతో, ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా ఆయనకి పాజిటివ్గా వచ్చినట్లు సన్నిహిత వర్గాలు చెప్పారు. ఇంకా విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన కథ అందించారు. తాజాగా ఆయన బాలీవుడ్ బహుభాష చిత్రం అయిన సీత చిత్రానికి కూడా స్క్రిప్ట్ ని సమకుర్చారు.