మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయనున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.
కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫర్లో హీరోయిన్ ఉండదు. కానీ, తెలుగు రీమేక్లో మాత్రం హీరోయిన్ పాత్రను యాడ్ చేశాడు దర్శకుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేసినట్టు ఇటవల వార్తలు వచ్చాయి.
అయితే హీరోయిన్ పాత్ర నిడివి తక్కువ అని, జస్ట్ గెస్ట్ రోల్ లాంటిది అని, అందుకే నయనతారు కాకుండా ఆ పాత్రలో అనుష్క అయితే బాగుంటుందనే చిరు దర్శకుడు సూచించారు. దీంతో మోహన్ రాజా కూడా అనుష్కనే తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. మరి అనుష్క గ్రీన్ సిగ్నెల్ ఇస్తుందో లేదో చూడాలి.