కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత..!

కరోనా సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఎంతో మందిని బలితీసుకుంటోంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది.

తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్ ఆదివారం కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన సన్నిహితుడు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. ఆ తర్వాత ఆయన పూణేలోని జహంగీర్ ఆస్పత్రిలో చేరారు. వెంటీలేటర్ పై చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నుంచి రాజీవ్ సాతావ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.