తెలంగాణ‌లో 2,625కి చేరిన క‌రోనా మ‌ర‌ణాలు..తాజా కేసులెన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి.

తెలంగాణ‌లోనూ నిన్న మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 4,81,640 కి చేరింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్య‌ధికంగా 1,104 మందికి క‌రోనా సోకింది.

నిన్న క‌రోనాతో 46 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 2,625 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 9,122 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 4,05,164 కు చేరుకుంది. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రంలో 73,851 మంది చికిత్స పొందుతున్నారు.